తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా , అక్క పాత్రలో మంచి పాపులారిటీ సంపాదించిన వారందరూ ఉన్నారు. అలాంటి వారిలో జయసుధ తన చెల్లెలు భానుప్రియ ముందు వరుసలో ఉంటారు. అయితే ఆ తర్వాత వచ్చిన జాబితాలలో శుభశ్రీ కూడా కనిపించింది. ఈమె మాలశ్రీ చెల్లెలు. అయితే శుభశ్రీ ఈమె జెంటిల్మెన్, పెదరాయుడు తదితర చిత్రాలలో నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. దాదాపుగా తెలుగులో 30 సినిమాలకు పైగా నటించి ఆ తర్వాత వివాహం చేసుకున్నది.

తాజాగా ఆలీతో సరదాగా  ప్రోగ్రాం లో పాల్గొంది ఈమే. ఈమెకు చదువుకోవడం పెద్దగా ఇష్టం లేదట. స్కూల్లో చాలా అల్లరి చేసేదంట శుభశ్రీ. దాంతో తన పేరెంట్స్ ను స్కూల్ లోకి తీసుకు రమ్మని చెప్పేవారట ఉపాధ్యాయులు. అలా తన సోదరుడికి స్కూల్ లోకి వచ్చేందుకు విసుగ్గా అనిపించేదని తెలియజేసింది. మొదటి నుంచి తనకి లెక్కలు అంటే చాలా భయమట. తన అల్లరి చేయడం వల్ల తనకి స్కూల్ లో నుంచి టీసీ ఇచ్చేవారని తెలియజేసింది. వివాహానికి ముందు తనకి పెళ్లి ముఖ్యమా కెరియర్ ముఖ్యమా తన అడిగితే తనకి వివాహమే ముఖ్యమని తెలియజేసింది.

ఇప్పటికీ ఆమె వివాహం అయి 24 సంవత్సరాలు అవుతోంది. వీరిద్దరికీ ఒక బాబు కూడా జన్మించారు. ఇక బెంగళూరులో తను డిగ్రీ పట్టా పొందినట్లుగా తెలియజేసింది. అంతేకాకుండా తన సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. తను ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గా తెలిపింది. ఇక తన అక్క మాలశ్రీ కూడా తన చిన్న వయస్సు నుంచి సినిమాలలో ఇప్పటికీ చేస్తూనే ఉన్నది అని తెలిపింది. కానీ తను మాత్రం కేవలం ఐదు సంవత్సరాల లోనే సినీ ఇండస్ట్రీకి దూరమయ్యానని బాధపడుతూ తెలియజేసింది శుభ శ్రీ. కానీ ఇప్పటికీ సినిమాలు చేస్తే బాగుండేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: