రామ్ చరణ్ తో ఇదివరకే వినయ విధేయ రామ సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ కియారా అద్వానీ. ఇప్పుడు మరొకసారి రామ్ చరణ్ తన 15వ సినిమాలో శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 చిత్రంలో కూడా ఈమె అవకాశం అందుకుంది. ఇకపోతే ఆలియా తర్వాత అంతటి రేంజిలో ఆఫర్ ను అందుకున్న హీరోయిన్ గా  కియారా అద్వాని ని యువత పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. శంకర్ సినిమాలో కథానాయకులకు గ్రాండియర్ లుక్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర కూడా ఉంటుంది . అందుకే కియారా కు నటిగా మంచి పేరు వస్తుందని అందరూ భావిస్తున్నారు.ఇక ఇదంతా పక్కన పెడితే కియారా అద్వాని సడన్ గా తన లుక్ ను చేంజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.ఈమె  కనిపించిన ప్రతిసారీ హాట్ లుక్ తో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఈసారి సాదాసీదా సమ్మర్ డ్రెస్ లో  కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సీజనల్గా సౌకర్యం కోసం ఎంపిక చేసుకున్నట్లు ఉంది ఈమె వస్త్రధారణ. అల్ట్రా బాడి హగ్గింగ్ డ్రెస్సులు సమ్మర్ సీజన్లో రోజువారి దుస్తులుగా ధరించడానికి సెట్ కావు.అందుకే ఇలాంటి కుర్తా లను  వేసవికాలంలో ధరించడం ఎప్పటికీ యువతరం ఆపలేరు అని మరొకసారి నిరూపించింది. అయితే కియారా అద్వానీ ఇలా ట్రెడిషనల్ కుర్తా లో కనిపించడానికి కూడా కారణం ఉంది.తాజాగా ఆమె స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత అమృత్సర్ నుండి తన నగరానికి తిరిగి రావడం జరిగింది. అందుకే ఇలా టెంపుల్ కి వెళ్లడానికి అందంగా రూపొందించిన కుర్తా సెట్ ను ధరించి అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇకపోతే 2022లో కియారా అద్వానీ తదుపరి నెలలో విడుదల కానున్న జగ్ జగ్ జియో.. భూల్ భూలయ్య వంటి సినిమాలలో నటించింది.ఈ రెండు కూడా మే నెలలో రిలీజ్ కానున్నాయి. ఇక అంతే కాదు విక్కీ కౌశల్ , భూమి పెడ్నేకర్ జంటగా నటించిన గోవింద నామ్ మేరా అనే సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.. ఇక హీరోయిన్ గా ఈమె రామ్ చరణ్ సినిమా పైన ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: