మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పాటలను ఆచార్య చిత్ర బృందం విడుదల చేయగా ఈ పాటలు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందాయి.

  ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.  ఈ సినిమా ట్రైలర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఆచార్య ప్రమోషన్ లలో భాగంగా ఈరోజు అనగా ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్, హైదరాబాద్ లో ఆచార్య మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించనుంది.  

ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై శ్రీదేవి శోభన్ బాబు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆచార్య' మూవీ తో శ్రీదేవి శోభన్ బాబు సినిమాకేంటి సంబంధం అంటే, శ్రీదేవి శోభన్ బాబు సినిమాను చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నిర్మించిన సినిమా కావడమే. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు  సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన గౌరీ హీరోయిన్ గా నటిస్తోంది.  శ్రీదేవి శోభన్ బాబు సినిమాకు కమ్రన్ సంగీతాన్ని సమకూర్చాడు.  ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై శ్రీదేవి శోభన్ బాబు మూవీ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: