సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `సర్కారు వారి పాట` పనులు పూర్తి చేసుకుని ప్రచార కార్యక్రమాన్నీ కూడా ప్రారంభించేశారు. అంతే కాదు ఎట్టకేలకు ఈ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఇందులో భాగంగా సోమవారం విడుదల అయిన ట్రైలర్ సినిమాపై అంచనాల్నిఅమాంతం పెంచేసి అభిమానులకు `పోకిరి` లో మహేష్ ని చూసిన ఫీలింగ్ ని కలిగించింది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు.
అయితే  రెండేళ్ల గ్యాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో మహేష్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఏంటో ఆసక్తితో  ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత మహేష్  త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని ఎస్. రాధాకృష్ణ  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు సమాచారం.కాగా త్రివిక్రమ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో బిజీగా ఉంటూ తన సినిమాని పట్టించుకోవటం లేదని మహేష్ ని అసహనానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు మహేష్ కు ఇప్పటి వరకు త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ ని వినిపించకపోవటంతో, సినిమా స్క్రిప్ట్ ని ఎప్పుడు లాక్ చేస్తాడా? .. ఎప్పుడు తనకు వినిపిస్తాడా అని మహేష్ విసుగు చెందారట.

కాగా త్రివిక్రమ్ ఇటీవలే ఫైనల్ స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. అయితే  ప్రస్తుతం మహేష్ తన  ఫ్యామిలీతో స్పెయిన్ లో వున్నారని అక్కడి నుండి వచ్చి `సర్కారు వారి పాట` ప్రమోషన్స్ లో పాల్గొంటారు. అయితే ఆ తరువాతే త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ ని మహేష్ కు వినిపించిన తరువాత జూలైలో ఈ సినిమాని ప్రారంభించాలనే  ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నట్లు ఇప్పటికే ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తమన్ ఈ సినిమాకి సంగీతం అందించనున్న విషయం కూడా తెలిసిందే. కాగా ఇంతటి భారీ బడ్జెట్ తో సెట్స్ పైకి వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో వేచి చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: