తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని రకాల జోనర్ ల లో సినిమాలు చేసే హీరోలు ఉన్నారని చెప్పాలి. అయితే కొన్ని టిపికల్ జోనర్ సినిమాలను టచ్ చేయడానికి రెగ్యులర్ కమర్షియల్ హీరోలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అవి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చినా కూడా తమ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందనే భయం వారిలో నెలకొన్నడమే ఈ రకమైన సినిమాలు చేయకపోవడానికి ముఖ్యకారణం. కానీ ఓ హీరో మాత్రం ఎలాంటి జోనర్ సినిమా అయినా ఎలాంటి టిపికల్ జోనర్ సినిమా నైనా చేయడానికి ముందుకు రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది.

దానికి తోడు ఆ చిత్రాలు మంచి విజయం సాధించడంతో వెరైటీ సినిమాలు చేసే హీరోగా ఆయన పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. ఈ విధంగా అడవి శేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలతో వెరైటీ సినిమాలు చేసే హీరోగా పేరు దక్కించుకుని ఇంతటి స్థాయిలో హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

రియల్ హీరో ఉన్ని కృష్ణన్ బయోగ్రఫీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులు అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత కావడం విశేషం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది అని చెప్పాలి. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ఘనవిజయం సాధించాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా కోరుకుంటున్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర సంఘటనలను ఈ చిత్రం ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమేమనగా ముఖ్య ఉద్దేశం అని ఇప్పటికే పలుమార్లు వెల్లడించింది. మరి ఎన్నో అంచనా ల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: