సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో త్వరలో ఒక భారీ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేష్, త్రివిక్రమ్ కలిసి గతంలో అతడు, ఖలేజా మూవీస్ చేసారు. అయితే వాటిలో అతడు సక్సెస్ అందుకోగా ఖలేజా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.

అయినప్పటికీ కూడా ఈ రెండు సినిమాలు మంచి కల్ట్ క్లాసిక్స్ గా ఇప్పటికీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక మళ్ళి దాదాపుగా పదేళ్ల తరువాత మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తుండడంతో కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మాత్రమే కాదు అటు ఆడియన్స్ లో సైతం ఈ మూవీ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిచనున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ వారు భారీ వ్యయంతో నిర్మించనుండగా థమన్ సంగీతం అందించనున్నారు. ఇటీవల అధికారిక పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ వాస్తవానికి ఈ పాటికి ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే స్క్రిప్ట్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్న త్రివిక్రమ్, దానిని పూర్తి చేయడానికి మరో నెల సమయం కోరారని, అందుకే ఈ మూవీ ప్రారంభం జులైకి వాయిదా పడిందని టాక్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్ అందరూ కోరుకునే పక్కా కమర్షియల్ అంశాల కలబోతగా ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసేందుకు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారని సమాచారం. అయితే విషయం ఏమిటంటే, రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన ఈ మూవీ మరికొంత లేట్ గా మొదలెట్టనుండడంతో ముందుగా అనుకున్న విధంగా దీని విడుదలని వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా సమ్మర్ కి రిలీజ్ చేసేలా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వినికిడి. ఇదే కనుక నిజం అయితే, సంక్రాంతికి తమ హీరో సినిమా వస్తుందని ఆశిస్తున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒకరకంగా ఇది నిరాశే అంటున్నారు విశ్లేషకులు. కాగా దీనిపై యూనిట్ నుండి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: