సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వరుసగా విజయవంతమైన సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించిన సర్కారు వారి పాట మూవీ మంచి విజయం అందుకుంది. మరోవైపు ఇటీవల వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసిన మహేష్ బాబు, లేటెస్ట్ సర్కారు వారి పాటతో మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు అనే చెప్పాలి. దీని తదుపరి త్రివిక్రమ్ తో ఒక మూవీ చేయనున్నారు సూపర్ స్టార్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం కానున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.

అతి త్వరలో దీని షూటింగ్ ప్రారంభం కానుండగా ఆ ఆతరువాత రాజమౌళితో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న మహేష్, వచ్చే ఏడాది మధ్యలో దానిని ప్రారంభించే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే ఆ మూవీ స్టోరీ పై కసరత్తు ప్రారంభించిన కథకుడు విజయేంద్రప్రసాద్, దానిని ఎంతో గ్రాండ్ గా ఉండేలా రాస్తున్నట్లు టాక్. భారీ యాక్షన్ కమర్షియల్ హంగుల మేళవింపుగా సాగనున్న ఆ మూవీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఎంతో భారీ బడ్జెట్ తో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో మహేష్ బాబుని ఢీ కొట్టే విలన్ పాత్రలో ఒక హాలీవుడ్ నటుడు పేరు పరిశీలిస్తున్నారట రాజమౌళి.

మహేష్ ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా ప్రాజక్ట్ చేయనప్పటికీ కూడా ఆయనకి దేశవ్యాప్తంగా విశేషమైన క్రేజ్ ఉంది, అలానే ఇతర దేశాల్లో కూడా మహేష్ మూవీకి భారీ కలెక్షన్స్ వస్తుంటాయి. అలానే ఆరడుగుల ఎత్తు, అందం కలిగిన హాలీవుడ్ కటౌట్ మహేష్ ని ఢీకొట్టాలి అంటే హాలీవుడ్ నటుడు అయితేనే పర్ఫెక్ట్ అనే జక్కన్న భావిస్తున్నారని, త్వరలో ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నాయని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: