టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు క్రిష్ తీస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్ర చేస్తుండగా కీరవాణి సంగీతాన్ని జ్ఞానశేఖర్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా మూవీగా యాక్షన్, కమర్షియల్, ఎమోషనల్ హంగులతో హరిహర వీరమల్లు తెరకెక్కుతున్నట్లు టాక్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్. అనంతరం సముద్రఖని తో ఒక సినిమా, అలానే సురేందర్ రెడ్డి తో మరొక సినిమా, అలానే గర్బబర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేయనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఈ మూడు సినిమాల అనంతరం పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలకు విరామం పలకనున్నారని, ఇప్పటికే తన జనసేన పార్టీ కార్యకలాపాలపై ఒకింత గట్టిగా దృష్టి పెట్టిన పవన్, ఆ సినిమా,అనంతరం తన జీవితాన్ని పూర్తిగా జనసేన పార్టీ ద్వారా ప్రజలకే సేవ చేయాలనే ఆలోచన చేస్తున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ విషయమై పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసి, ఆ మూడు సినిమాల షూటింగ్స్ త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధం అవుతున్నారట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే పవన్ ఫ్యాన్స్ కి ఇకపై సినిమాల విషయమై నిరాశ తప్పదు అంటున్నారు విశ్లేషకులు. కాగా ఈ విషయమై అధికారికంగా ప్రకటన వస్తేనే కాని నమ్మలేం అంటున్నారు పలువురు సినీ, రాజకీయ వర్గాల వారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: