అంతే కాకుండా ఈ రోజు సన్నీ లియోన్ ''ఓయ్ గాలి నాగేశ్వరరావు, చాలా రోజుల నుంచి కనిపించడం లేదు'' అనే ఒక డైలాగును నెట్టింట్లో విడుదల చేశారు. అయితే దానిని కోట్ చేసిన పాయల్ 'ఇంకెన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్' అని విష్ణు మంచును అడగగా దానికి సమాధానంగా రేపు ఉదయం చెబుతానని విష్ణు సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... విష్ణు కుమార్తెలు అయిన అరియనా, వివియానా ఒక పాట పాడారు. కాగా ఎంత చిన్న వయసులోనే ఆ పిల్లలు ఏంటో అందంగా పాట పాడటం అందులోను అది తమ తండ్రి సినిమాకే చేయటం విశేషం. అలాగే ప్రభుదేవా ఈ సినిమాకు కొరియోగ్రఫీ చేశారు.
మరి కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో ఏవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా రూపొందించబడుతుంది. కాగా దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథను అందించగా... కోన వెంకట్ కథ, అలాగే స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే, అయితే ఈ సినిమాకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.... చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఈ సినిమాతో అయినా మంచు విష్ణు హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.