బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అతి కొద్ది మందిలో పూజా హెగ్డే కూడా ఒకటి..మొదటి సినిమా తో మంచి మార్కులు వేయించుకున్న అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యి పోయింది..అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హిరొల సరసన నటించి మెప్పించింది. అయితే ఈ మధ్య పూజకు మంచి టైం రాలేదు..ఇటీవల విడుదల అయిన సినిమాలు ఏవైనా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకోలేక పోయాయి..అయిన పూజకు సినిమా అవకాశాలు మాత్రం తగ్గలేదు.


ఇది ఇలా ఉండగా పూజాకు చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది... ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..తాజాగా తను ఓ ఇండిగో విమానంలో ప్రయాణించగా అందులోని సిబ్బంది పూజాతో అసభ్యంగా ప్రవర్తించి అసౌకర్యానికి గురిచేశారట.దీనికి సంబంధించి పూజా హెగ్డే తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.పూజా హెగ్డే తన ట్విట్టర్ లో ఈ విషయంపై పోస్ట్ చేస్తూ.. ముంబై నుండి బయలుదేరిన విమానంలో విపుల్ నకాషే అనే పేరు గల సిబ్బంది మాతో ఎంత అసభ్యంగా ప్రవర్తించినందుకు చాలా విచారంగా ఉంది. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం మరియు బెదిరింపు టోన్ తో మాతో ప్రవర్తించాడు.



సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది అని తెలిపింది.ఇండిగో సంస్థ స్పందిస్తూ.. పూజా హెగ్డేకి క్షమాపణలు చెప్తూ మీ ప్రాబ్లమ్ ని, మీరు ప్రయాణించిన టికెట్ PNR నంబర్ ని మాకు మెసేజ్ చేయండి. మేము త్వరగా మీ సమస్యని పరిష్కరిస్తాము అని పోస్ట్ చేశారు. పూజా హెగ్డేతో అసభ్యంగా ప్రవర్తించారని ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ కాగా పలువురు నెటిజన్లు ఇండిగో సంస్థ, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...ఇక పూజా సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తుంది.. ఆ సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: