మలయాళ చిత్రం ప్రేమమ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో ఫిదా సినిమా తో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తున్నది. ప్రస్తుతం విరాటపర్వం సినిమాను రానా తో కలిసి నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏనుగుల ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. 1992 వ కాలంలో తెలంగాణలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రంపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఒక మీడియా ఇంటర్వ్యూ లో రానా,  సాయిపల్లవి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.. ఇంతవరకు చేసిన పాత్రలన్నీ తనకి సంతృప్తిని ఇచ్చాయి. ఇక కెరియర్ ఆపేయాలని అనిపించిన సందర్భంలో డాక్టర్ వృత్తిని ప్రారంభిస్తానని తెలియజేసింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ఎంతో మంది ఉన్నా  వారందరికీ భిన్నంగా నటిస్తూ స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకుంది. అయితే తాను ఎందుకో ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటే అంత మంచిది అని  తాజాగా వివరించడం జరిగింది సాయి పల్లవి.

తమది సాంప్రదాయమైన కుటుంబం తన తండ్రి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అని,  తనకు ఒక చెల్లెలు కూడా ఉందీ. ఇంట్లో ఉన్నప్పుడు తర్వాత వారిద్దరూ కలిసి షటిల్ ఆడుతూ ఉండేవారట. కేవలం ఆ సమయంలో మాత్రమే సౌకర్యంగా ఉండేలా పొట్టి దుస్తులు వేసుకుంటాము.. అయితే సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలో ఒక సంఘటన జరిగింది ఆ కారణంగానే సినిమాలో పొట్టి డ్రెస్సులు వేసుకోకూడదు నిర్ణయించుకున్నానని తెలియజేసింది.జార్జియా కి వెళ్ళినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకోవాలి అంటే అందుకు తగ్గట్టుగా డ్రెస్సులు వేసుకోవాలి. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు వివరించగా వారు ఓకే అని చెప్పారు. కానీ ఆ తర్వాత ప్రేమమ్ సినిమాలో నటించే అవకాశం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసించారు. ఆ సమయంలోనే తన టాంగో డాన్స్ వీడియో ఒకటీ వైరల్ అయ్యింది.. దానిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్ చేయడం తో తనకు బాధ కలిగించిందని ఆ నిమిషం నుంచి అలాంటి సినిమాలకు నో చెప్పడం మొదలుపెట్టాను తెలిపిన సాయి పల్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: