కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ తమిళ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడి పోయింది.  

తమిళ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా,  ఇతర భాషలలో మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇది ఇలా ఉంటే తలపతి విజయ్ 'బీస్ట్' సినిమా సెట్స్ పై ఉండగానే టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. విజయవంతంగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను  దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఈసినిమా తలపతి విజయ్ కి కెరీర్ పరంగా 66 వ సినిమా. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నట్టులో ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ చెప్పుకొచ్చాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం లోకి వెళితే...  ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుగులో ఈ మూవీ కి వారసుడు అనే టైటిల్ ను,  తమిళ్ లో వరిస్సు అనే టైటిల్ ను చిత్ర బృందం ఈ మూవీ కి చేయనున్నట్లు చేయను అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన తలపతి విజయ్ పుట్టినరోజు రానున్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో తలపతి విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: