ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగం గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన జై తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఏ మాయ చేసావే సినిమా అందరికీ సుపరిచితమే. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రం తమిళం లో విన్నైతాండి పేరుతో రిలీజై అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా లో హీరోగా శింబు, హీరోయిన్ గా త్రిష నటించారు. అయితే లెక్క ప్రకారం ఈ సినిమాలో జై నటించాల్సి ఉందట. ఎందుకంటే డైరక్టర్ గౌతమ్ ఈ సినిమాకోసం మొదటగా జై ని కలిశాడట.
అయితే ఆ సమయంలో జై వేరే సినిమాలో బిజీ షెడ్యూల్ ఉన్నందువలన చేయలేకపోయాడట. దానికి జై మాట్లాడుతూ. సినిమా ఆఫర్ మొదట తనకే వచ్చింది కానీ తన డేట్స్ అడ్జస్ట్ కాలేక పోవడం వల్ల ఈ సినిమాను వదులుకోవలసి వచ్చింది, లేదంటే నా సినిమా కెరీర్ మరోలా ఉండేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే కుష్బూ సుందర్ నిర్మించిన ఇన్వెస్ట్మెంట్ థ్రిల్లర్ చిత్రం 'పట్టంబూచి'కి బద్రి వెంకటేష్ దర్శకత్వం వహించారు.