టి.కృష్ణ గారి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్. 'తొలివలపు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ కు మొదటి సినిమాతోనే చేదు అనుభవం ఎదురైందట.


తర్వాత అతను ఖాళీగా ఉన్న టైంలో పిలిచి మరీ 'జయం' సినిమాలో విలన్ ఛాన్స్ ఇచ్చాడట దర్శకుడు తేజ. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన 'నిజం', ప్రభాస్ హీరోగా నటించిన 'వర్షం' చిత్రంలో కూడా ఆయన విలన్ గా చేశాడు గోపీచంద్.


 


అయితే అదే టైంలో నిర్మాత పోకిరి బాబురావు గారు 'యజ్ఞం' సినిమా కథని తీసుకెళ్లి ప్రభాస్ అండ్ ఫ్యామిలీకి వినిపించారట. 'కథ బాగుంది కాకపోతే వేరే దర్శకుడు అయితే చేద్దాం అని' వాళ్ళు సమాధానం ఇచ్చారట. ఆ టైంలో దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి తీసిన ఒక్క సినిమా 'మనసుతో' కూడా ప్లాప్ అయ్యిందట.. ఆ దర్శకుడు అంత బరువు గల కథని హ్యాండిల్ చేయలేడేమో అనే ఉద్దేశంతో 'యజ్ఞం' కథని పక్కన పెట్టినట్లు ఇటీవల గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


 


అటు తర్వాత అదే కథని కళ్యాణ్ రామ్ కు కూడా వినిపించినట్లు సమాచారం.. అక్కడ నుండి కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చినట్టు గోపీచంద్ తెలిపాడు. ఆ టైంలో గోపీచంద్ ను చేయమని కూడా అడిగారట. కానీ అప్పుడు 'వర్షం' సినిమా షూటింగ్లో ఉండడం వలన.. అలాగే 'నిజం' సినిమాకి గుండు చేయించుకోవడం వలన జుట్టు సరిగ్గా రాలేని కారణంగా కొన్నాళ్ళు ఆపి 'వర్షం' సినిమా రిలీజ్ అయ్యాక చేశాడట గోపీచంద్. 2004 లో విడుదలైన 'యజ్ఞం' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.


 


గోపీచంద్ ను మళ్ళీ హీరోగా నిలబెట్టింది. ఈరోజు గోపీచంద్ హీరోగా నిలబడడం వెనుక ప్రభాస్, కళ్యాణ్ రామ్ లు కూడా ఉన్నారని గోపీచంద్ కామెంట్స్ తో స్పష్టమవుతుంది.ఇక గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుందని తెలుస్తుంది..మారుతి ఈ చిత్రానికి దర్శకుడు కాగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా ఇందులో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: