హీరో గోపీచంద్ ముఖ్యమైన పాత్రలో డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన చిత్రం పక్కా కమర్షియల్ ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించింది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా జులై-1 వ తేదీన విడుదలై మొదటి షో నుంచి మంచి టాక్ ను తెచ్చుకోవడమే కాకుండా మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ సంబరాలు చాలా ఘనంగా జరుపుకున్నారు.


పక్క కమర్షియల్ చిత్రం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశారు డైరెక్టర్ మారుతి ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ తో తన తదుపరిచిత్రాలు వస్తూనే ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలోనే డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. జులై 1వ తేదీన పక్క కమర్షియల్ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వెళుతోంది. తన సినిమాలలో ఉండే ఎంటర్టైన్మెంట్ ని ఈ చిత్రంలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా కూడా పని తగ్గలేదని తనకు ప్రతి ఒక్కరు కూడా బాగుందని మెసేజ్లు చేస్తున్నారని తెలియజేశారు.


ఆడియన్స్ తను తీసే సినిమాలలో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి.. తన గత చిత్రాలు ఏ విధంగా హిట్ చేశారు ఈ సినిమాను కూడా అలా ఫిట్ చేశారు వారందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా అల్లు అరవింద్ గారు నాతో ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా ఉందని తెలియజేశారు. ప్రతి రోజుకి కూడా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి గోపీచంద్ ను చాలా రోజుల తర్వాత బాగా చూపించారు అంటూ కామెంట్లు వస్తున్నాయని తెలిపారు. రాశి ఖన్నా నటన కూడా ఇందులో బాగుందని రావు రమేష్ కూడా చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నట్లుగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: