RRR సినిమాతో జాతీయస్థాయిలో అందులో నటించిన నటి నటుల సైతం పేరు పొందారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ బాగా పేరుపొందాలని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్ రాజమౌళి క్రేజ్ వల్లే ఇదంతా సొంతమైనది. ఇప్పుడు rrr హీరోలు ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఇప్పటికే ఈ హీరోలు చెరో రెండు పాన్ ఇండియా చిత్రాలలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే చరణ్ ,ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తన తదుపరి సినిమాలతో హిట్ కొట్టాలని ఒత్తిడితో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.


RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాతో డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. ఆచార్య చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు కానీ ఆర్ఆర్ అర్ తో వచ్చిన క్రేజ్ చరణ్ కు ఈ సినిమాకు అంతగా ఉపయోగపడలేదు. ఇక ఇప్పుడు తాజాగా తను నటించబోతున్న RC-15  చిత్రంతో కచ్చితంగా సత్తా చాటాలని ఆలోచిస్తున్నాడు చరణ్. ఇక తర్వాత గౌతమి తిన్ననూరి డైరెక్షన్లు ఒక సినిమాలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడు చరణ్.

మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త ఎక్కువగానే ప్రెషర్ ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆచార్య ఓటమి కారణాలతో ఎన్టీఆర్ పై మరింత ప్రభావం చూపుతోంది. ntr -30 వ సినిమాని డైరెక్టర్ కొరటాల శివ చేయడం జరుగుతోంది. ఆచార్య చిత్రం ఘోర పరాజయం కావడంతో కొరటాల శివ సినిమా డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను తీర్చే బాధ్యత తీసుకున్నట్లుగా ఇండస్ట్రీలో  టాక్ వినిపిస్తోంది. అమెజాన్  ఓటీటిలో విడుదలైనప్పటికీ.. ఈ సినిమా నష్టపోయింది అని పంపిణీ దారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వారందరి నష్టాన్ని క్లియర్ చేసిన తర్వాతే తన తదుపరి ప్రాజెక్టును చేయాలని ఆలోచిస్తున్నట్లుగా కొరటాల శివ సమాచారం. దీంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ పైన తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: