బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ బర్త్ డే వేడుకలు కోసం ఇదివరకే తన భర్త విక్కీ కౌశల్ తో కలిసి ఒంటరి మాల్దీవులకు వెళ్ళింది. ఇప్పుడు తాజాగా అక్కడ గర్ల్స్ గ్యాంగ్ తో చేరడం జరిగింది. అంతేకాకుండా గర్ల్స్ గ్యాంగులో విక్కీ కౌశల్ సోదరుడు సన్నీ కూడా అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ శార్వరి కూడా హాజరయ్యింది. ఇక కత్రినా కైఫ్ సోదరి కూడా అక్కడ కనిపించింది. ప్రస్తుతం వీరందరూ కలిసి గ్యాంగ్ బికినీ బీచ్ లో ఒరేంజ్ లో సెలబ్రేషన్ చేసుకున్నారు. మాల్దీవుల నుంచి సెలబ్రేషన్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు కత్రినా కైఫ్ షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి సన్నీ కౌశల్ తో పుట్టినరోజు వేడుకల ఫోటోలను కత్రినా షేర్ చేయగా అభిమానుల నుంచి పలు రకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కత్రినా భర్త విక్కీ కౌశల్ తో తన పుట్టినరోజు వేడుకలను చూడాలనుకున్నాము అంటూ అభిమానుల సైతం కామెంట్ చేస్తున్నారు. ఇక గర్ల్స్ గ్యాంగులో ఎంతోమంది ఉన్నప్పటికీ విక్కీ మిస్ అయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలో సన్నీ కౌశల్ చాలా ఫన్నీగా అమ్మాయిలందరిని నవ్విస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఇక కత్రినా స్నేహితుల నుంచి బర్తడే విషెస్ కూడా వెలుబడుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేహా దుపియా, సన్ షైన్ గర్ల్స్ అని పొగిడేయడం జరిగింది. కత్రినా తన 39వ పుట్టినరోజు వేడుకలు చాలా అమూల్యమైన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేమను కురిపించింది అయితే చాలా మంది అభిమానులు తన భర్త విక్కీ కౌశల్ తో కత్రినా ఫోటోలను చూడాలని ఆ ఫోటోలు ఎప్పుడు పంపిస్తారు అని అడిగాడు. ఇక విక్కీ కౌశల్ కూడా కత్రినా ఫోటోను షేర్ చేస్తూ చాలా సింపుల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కత్రినా కైఫ్ కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: