ప్రవీణ్ సత్తారు దర్శకత్వ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. చాలా తక్కువ మంది టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఈ దర్శకుడు కూడా ఒకరు. చందమామ కథలు సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకొని పాపులారిటీ తెచ్చుకున్న ఈ దర్శకుడుతో కలిసి కొంత మంది పెద్ద హీరోలు సైతం సినిమాలు చేయడానికి ప్రయ త్నాలు చేస్తున్నారు. అలా ఇప్పుడు అక్కినేని నాగార్జున ఈ దర్శకుడితో కలిసి సినిమా చేస్తుండడం విశేషం.

అంతకుముందు గరుడవేగ సినిమాతో పెద్ద సినిమాలను బాగానే హ్యాండిల్ చేస్తాడు అన్న పేరు దక్కించుకున్న ప్రవీణ్ సత్తారు ఇప్పుడు ఈ చిత్రం ద్వారా అగ్ర దర్శకుల జాబితాలోకి చేరాలని భావిస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నాగార్జున గత సినిమాల కంటే యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ ఉండగా మొత్తం 12 యాక్షన్ సీక్వెల్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంత లేదన్న నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ కంటే క్లాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో యాక్షన్ పాళ్లు కనక ఎక్కువైతే తప్పకుండా అది సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉందని కొంతమంది సినిమా నిపుణులు చెబుతున్నారు. ఒక గూఢచారి పాత్రలో ఉగ్రవాదాన్ని నేలమట్టం చేసే సినిమాగా ఇది తెరకెక్కబోతుంది. ఈ నేపథ్యంలో దీనిని ప్రేక్షకులు మరియు అక్కినేని అభిమానులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఇక ఈ సినిమా కి సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా రాలేదు. ఈ సినిమా యొక్క విడుదల తరువాత వచ్చే ఫలితం తర్వాత సీక్వెల్ గురించి ఆలోచిస్తానని దర్శకుడు ప్రవీణ్ ఇప్పటికే వెల్లడించారు. మరి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: