ఇక డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో సత్య ప్రకాష్ కీలకమైన పాత్రలో నటించారు. హీరో గోపీచంద్ కూడా ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నారు కానీ ఫలితం మాత్రం ఇద్దరిని తీవ్ర నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ మారుతి ప్రభాస్ చిత్రం ఉంటుందా అనే విషయంపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పక్కా కమర్షియల్ చిత్రం ఫలితం కారణంగా ఈ సినిమాని పక్కన పెట్టేసారని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ uv మూవీ చిత్ర బ్యానర్ మాత్రం ఈ సినిమాని తెరకెక్కించే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది అందుకోసం ప్రభాస్ ని ఒప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉండగా హీరోయిన్ మాళవిక మోహన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా అనుష్క మాళవిక మోహన్ నటిస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాళవిక మోహన్ మారుతి ప్రాజెక్టులపై ఇన్ డైరెక్టర్గా ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.తెలుగులో చేయబోతున్న మొదటి ప్రాజెక్టు గురించి త్వరలోనే తమ ప్రొడ్యూసర్ తెలియజేస్తారని తెలిపింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ వస్తున్న చిత్రంలో నటించబోతోందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.