తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ ఆ తర్వాత జయం సినిమాలో విలన్ గా నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఆక్రమంలోనే నిజం వర్షం, వంటి సినిమాలలో కూడా విలన్ గా నటించి అద్భుతమైన నటనని ప్రదర్శించాడు.. కానీ యజ్ఞం సినిమాతో ఒక్కసారిగా మళ్లీ హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నారు గోపీచంద్. ఇక ఆ తర్వాత పలు యాక్షన్ సినిమాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు గోపీచంద్. ఇక తర్వాత ఆంధ్రుడు, గోలీమార్, రణం, లౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.


అయితే తాజాగా పక్క కమర్షియల్ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకొని విడుదల చేయగా ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు అన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు. హీరోయిన్గా రాశీ ఖన్నా నటించింది. ఇక ఈ సినిమా మొదటి వీకెండ్ మంచి వసూళ్లని రాబట్టిన.. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఇదంతా ఇలా ఉండగా గోపీచంద్ తాజాగా కమిట్ అయిన ఒక ప్రాజెక్టు మిస్సయ్యేలా ఉండబోతోంది అనే టాక్ వినిపిస్తోంది.


తమిళ డైరెక్టర్ హరి మరియు గోపీచంద్ కాంబినేషన్లు ఒక మూవీ తెరకెక్కించడానికి చాలా రోజులు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.. గతంలో సింగం, యముడు వంటి సినిమాలతో మంచి క్రేజీ సంపాదించుకున్న డైరెక్టర్ హరి టాలీవుడ్ లో గోపీచంద్ కు సరిపడే స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసినట్లుగా వార్తలు వినిపించాయి అయితే ఇప్పుడు ఈ సినిమా పక్కన పెట్టే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాని సెక్స్ మీదికి తీసుకువెళ్లాలనుకుని నిర్మాతలు సైతం కాస్త డైలాగ్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇక గతంలో గోపీచంద్ శ్రీనివాస్ డైరెక్షన్లో లక్ష్యం, లౌక్యం అంటే సినిమాలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి దీంతో ఇప్పుడు తన 30వ చిత్రాన్ని కూడా ఈయనతోనే తిరగొట్టించాలని ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం గోపిచంద్.

మరింత సమాచారం తెలుసుకోండి: