ఇక లైగర్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పూరీ, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్స్ కంటే నెగటివ్ వైబ్స్ ఎక్కువగా వస్తున్నాయి. మళ్ళీ విజయ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పైగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ కొంచెం బడాయిగా మాట్లాడుతూ కొన్ని అనకూడని షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు. ఇక ఈ ట్రైలర్ ను కనుక మనం పరిశీలిస్తే ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ముంబై గల్లీలలో టీ అమ్ముకునే రమ్యకృష్ణ కొడుకు విజయ్ దేవరకొండ ఇక ప్రపంచ స్థాయి బాక్సింగ్ చాంపియన్ గా ఎలా ఎదిగాడు ? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. ఈ ట్రైలర్ పూరీ మార్క్ తో సాగలేదని తెలుస్తుంది. హీరోకి నత్తి ఉండడంతో అవి బూతులేమో అని భ్రమింప చేసేలా కొన్ని డైలాగ్స్ పలికించాడు పూరీ. అంతేకాక రమ్యకృష్ణ నోటి వెంట కూడా సాలా అంటూ ఇంకా క్రాస్ బ్రీడ్ అంటూ పలికించడంతో ఇది ఖచ్చితంగా బోల్డ్ సబ్జెక్ట్ అని భావించవచ్చు.దానికి తోడు రింగ్ లో విజయ్ దేవరకొండ ఫైట్ చేసిన అతనితోనే అనన్య పాండే ప్రేమలో పడినట్టు చూపడం కూడా కొంచెం కొత్తగా అయితే కనిపిస్తోంది.పర్వాలేదు.ఇక ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు అమాంతం పెంచడానికి పూరీ జగన్నాధ్ ప్రయత్నిస్తాడు అనుకుంటే ఉన్న గాలి కూడా తీసేసినట్టు అయింది.


ఈ ట్రైలర్ విజయ్ దేవరకొండ అభిమానులకు కూడా నచ్చట్లేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇక నత్తి కుర్రాడిగానే కనిపిస్తూ విజయ్ దేవరకొండ చేస్తున్న ఫైట్ సీన్లు కూడా పేలవంగా సాగుతూ ముందుకు వెళ్లాయి. విజయ్ నత్తిని అడ్డుపెట్టుకుని సినిమాలో పూరీ బూతులు మాట్లాడించే అవకాశం కూడా వుంది.అయితే నిజానికి పూరీ జగన్నాధ్-విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సబ్జెక్ట్ అనగానే దేశావ్యాప్తంగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను ట్రైలర్ ఏమాత్రం అందుకోలేక పోయిందనే చెప్పాలి. వ్యూస్ బాగానే వచ్చాయి. కానీ ఒక పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ట్రైలర్ కి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.మరి ఈ ట్రైలర్ తో జనాన్ని థియేటర్ కు రప్పించడం అనేది చాలా కష్టమైన విషయం. పాన్ ఇండియా లెవెల్ లో కాకుండా తెలుగులో తీసి ఉంటే ఒక రకంగా బాగుందేమో.. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా తీసి తప్పు చేశాడా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: