టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకు వచ్చింది.అల్లూరి సీతా రామరాజుగా చరణ్ లుక్, నటన నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ప్రస్తుతం రాంచరణ్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు.దీనితో ఇక ఈ చిత్రం మెమొరబుల్ గా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన లీకులతో సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. RC 15 విషయంలో కూడా శంకర్ ఎక్కడా అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. రాంచరణ్ కూడా వివిధ గెటప్స్ లో అదరగొట్టేస్తున్నారు.ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు కూడా ఈ మూవీలో తమిళ నటుడు ఇంకా దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది.


ఎస్ జె సూర్య పాత్ర ఈ మూవీలో కంఫర్మ్ అంటూ కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో సముద్ర ఖని కూడా నటిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. వీళ్ళు నటిస్తున్నారా లేదా అనే విషయంలో దిల్ రాజు సంస్థ ఇంకా క్లారిటీ కూడా ఇవ్వలేదు.ఇంతలో ఈ పుకార్లు ఎక్కువయ్యాయి. కొంతమంది అప్ కమింగ్ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవన్నీ కూడా ఫేక్ న్యూస్ అని దిల్ రాజు బ్యానర్ క్లారిటీ ఇచ్చింది. తమ చిత్రాలకు కాస్టింగ్ ఇంకా అలాగే ఆడిషన్స్ నిర్వహించే అధికారం ఏ ఏజెన్సీ సంస్థకు లేదని ప్రజలు దీనిని గమనించాలి అని పేర్కొంది.మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. యస్ యస్ తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హాట్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: