ప్రస్తుతం టాలీవుడ్‌లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా . అయితే అవన్నీ దాదాపు మంచి సక్సెస్ సాధించాయి. ఇక ఆ తర్వాత నందిని రెడ్డి  'ఓ బేబీ'  సినిమాతో యువకుడిగా మళ్ళీ సినీ ఎంట్రీ ఇచ్చాడు.ఇదిలావుంటే ఇక ఇక అతడ్ని హీరోగా మార్చిన ఘనత మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ  దే. అయితే 'జాంబి రెడ్డి' చిత్రంతో తేజా సజ్జా హీరోగా అడుగుపెట్టాడు. కాగా ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు. ఇకపోతే 'ఇష్క్, అద్భుతం' చిత్రాలు అంతగా మ్యాజిక్ చేయనప్పటికీ.. 

అవకాశాలు మాత్రం ఆగడం లేదు.పోతే  ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సూపర్ హీరోగా 'హనుమాన్'  అనే మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలావుంటే 'హనుమాన్' చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇక ఈ సినిమాను రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.పోతే  తేజా రేంజ్‌కు ఆ బడ్జెట్ ఎక్కువనే చెప్పాలి. ఇక అమృతా అయ్యర్  కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇదిలా ఉంటే.. దీని తర్వాత తేజా వరుసగా రెండు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. నక్కిన త్రినాథరావు  దర్శకత్వంలో ఒక సినిమాకి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.అయితే  అతడు చెప్పిన ఓ కామెడీ కథాంశం తేజాకి బాగా నచ్చిందట.

ఇదిలావుంటే ప్రస్తుతం రవితేజతో ధమాకా అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు నక్కిన.ఇక ఇది పూర్తికాగానే తేజా సజ్జా హీరోగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు.తేజా సజ్జా.. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్.ఇక  నిఖిల్ హీరోగా 'సూర్య VS సూర్య'  అనే మూవీ తెరకెక్కించిన కార్తిక్.. చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.అయితే  సినిమాటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కార్తిక్.. ఆ తర్వాత దర్శకుడిగా మారాడు.ఇకపోతే  'కార్తికేయ 2' చిత్రంతో ఎడిటర్ గానూ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఇలా అన్ని శాఖల్లోనూ ప్రవేశమున్న కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా సినిమా చేస్తుండడం విశేషమని చెప్పాలి.అయితే  'హనుమాన్' సినిమా ఏమాత్రం హిట్టయినా.. హీరోగా తేజా సజ్జా దశ తిరిగినట్టే. ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: