ఏమైందో తెలియదు కానీ ఆ పాత్రలోకి కీర్తి సురేష్ రావడం జరిగింది. ఇక ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ కీర్తీ సురేష్ ను తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా కథానాయకగా మొదట మలయాళ నటిని అనుకున్నారట. ఈ విషయాన్ని అశ్వినీ దత్ స్వయంగా వెల్లడించారు. మా సినిమా కోసం మలయాళ హీరోయిన్ ను అనుకున్నాము. కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉన్నాయా.. పెట్టద్దు.. అలాంటి ఉంటే చేయను.. అని ఆమె చెప్పింది. అందుకే ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి వీల్లేదు అని డైరెక్టర్ తో చెప్పాను అని అశ్వినీ దత్ వెల్లడించారు.
అయితే డైరెక్టర్ హీరోయిన్ పేరు చెప్పలేదు కానీ అప్పట్లో నిత్యామీనన్ పేరు వినిపించింది కాబట్టి ఆమెనే అని అందరూ అంటున్నారు .ఏది ఏమైనా మహానటి లాంటి గొప్ప సినిమా నిత్యకు దూరమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఆలీతో సరదాగా షో కి హాజరైన అశ్వినీ దత్ పూర్తి వివరాలను వెల్లడిస్తారేమో తెలియాల్సి ఉంది