తెలుగు చిత్ర పరిశ్రమలో రొటీన్కు భిన్నంగా సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి.  అలాంటి వారిలో చందు మొండేటి కూడా ఒకరు. ఇప్పటివరకు తన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు చందు మొండేటి. మిగతా దర్శకులతో పోల్చిచూస్తే అతను సినిమాలో కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. 2014లో కార్తికేయ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు అనే విషయం తెలిసిందే.


 ఆ తర్వాత ప్రేమమ్, సవ్యసాచి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. నివేద పేతురాజ్ ప్రధాన పాత్రలో బ్లడీ మేరీ సినిమాను తెరకెక్కించాడు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం సరైన హిట్ లేక ఎంతగానో నిరాశ చెందాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే మరోసారి తనకు కలిసి వచ్చిన కార్తికేయ అనే సినిమాకు సీక్వెల్ తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే. నిర్మాతలకు లాభాల పంట పండించింది. మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. నార్త్ లో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వస్తూ ఉండడం గమనార్హం.  కాగా ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న దర్శకుడు చందు మొండేటి ఓ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా తెరకెక్కింది. అంతకుముందు  ప్రేమమ్ లాంటి హిట్ ఇచ్చాడు దర్శకుడు. సవ్యసాచి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. అయితే చైతు మిమ్మల్ని నమ్మి మీ తో సినిమా చేస్తే ఎందుకు సక్సెస్ కాలేకపోయారు అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు. సవ్యసాచి విషయంలో దర్శకుడిగా చాలా బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ కు ఐదు రోజుల ముందు తనకు రిజల్ట్ అర్థమైంది. తన అనుకున్న మార్కు సినిమాలో లేదని.. ఇక ఏదైనా మ్యాజిక్ జరిగి పెద్ద హిట్ అయితే బాగుండు అని కోరుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. కథలో కన్ఫ్యూజ్ అవ్వడం కారణంగానే ఇలా జరిగిందని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: