ఈటీవీ 27వ వార్షికోత్సవ వేడుకలను చాలా ఘనంగా ప్లాన్ చేశారు సినీ సెలబ్రిటీలు సైతం తమ షోలకు తీసుకువచ్చే స్పెషల్ అట్రాక్షన్ గా చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా క్యాష్ షోలో అలనాటి హీరోయిన్స్ జయసుధ ,ఖుష్బూ, ఆమని,సంఘవి అలాంటి హీరోయిన్ సందడి చేయడం జరిగింది. ఈ షో లో యాంకర్ సుమతో కలిసి నవ్వులు పూయించారు అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా మల్లెమాల సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈటీవీలో తమకున్న అనుబంధాన్ని గురించి కూడా గుర్తు చేశారు ఈ సినీ సెలబ్రిటీస్. ఇక అంతే కాకుండా హుటల్ పెట్టేదేలే అంటూ ఒక స్పెషల్ స్కిట్ కూడా చేయడం జరిగింది.


ఇక జయసుధ దోశ, ఆమని పెసరట్టు, సంఘవి సాంబార్ ఇడ్లీ.. సుమ పంచు డైలాగ్ వేయడం జరిగింది.. ఇందులో అలనాటి హీరోయిన్లను విభిన్నమైన ప్రశ్నలు అడగగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఆన్సర్లు తెలియజేయడం జరిగింది హీరోయిన్స్. అంతేకాకుండా తమ కుటుంబంలో జరుగుతున్న కొన్ని కామెడీ సన్నివేశాలను కూడా ఈ హీరోయిన్లు తెలియజేస్తూ బాగా నవ్వించారు. ఇక తర్వాత కొంతమంది హీరోల ఫోటోలు డిస్ప్లే చేయగా అందులో మొదట శోభన్ బాబు ఫోటోలు చూపించి జయసుధను సమాధానం చెప్పమనగా..


శోభన్ బాబు డార్లింగ్ అని చెప్పడం జరిగింది ఇక కృష్ణ ఫోటో చూపించగా అందరితో ఎక్కువగా యాక్ట్ చేశాను కానీ ఈయనతో తక్కువగా నటించానని తెలిపింది. ఆయన చాలా బిజీగా ఉంటారు మీరు బిజీగా ఉంటారని సుమ అనగా కాదు ఎందుకంటే ఆయన నా అంకుల్ కాబట్టి అంటే జయసుధ అందరిని నవ్వించింది. ఇక జయసుధ ఇండస్ట్రీ లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను చాలా ఘనంగా సన్మానించారు. అయితే ఆమె ఇండస్ట్రీలో వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఆమెకు ఎవరు కూడా ఒక పూల బోకే కూడా పంపలేదని.. తెలియజేసింది ఇప్పుడు తాజాగా ఈటీవీ నిర్వాహకులు చాలా ఘనంగా సన్మానించారు ప్రస్తుతం విప్రోమో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: