ఈ సంవత్సరం ఆగస్ట్ నెల తెలుగు సినిమా ఇండస్ట్రీ కి బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే జూన్ 3 వ తేదీన విడుదల అయిన మేజర్ మోవిడ్ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయవంతమైన సినిమా కూడా రాలేదు. మంచి అంచనాల నడుమ విడుదలైన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలాంటి సమయం లోనే ఆగస్ట్ 5 వ తేదీన దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతా రామం సినిమా మరియు కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరీన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార మూవీ లు విడుదల అయ్యాయి.

ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను సంపాదించుకొని, అదే రేంజ్ లో కలెక్షన్ లను కూడా ప్రపంచ వ్యాప్తంగా రాబడుతూ బ్లాక్బస్టర్ విజయాలను బాక్సాఫీస్ దగ్గర నమోదు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆగస్ట్ 13 వ తేదీన నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికి కూడా ఈ మూడు మూవీ లు ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 12 వ తేదీన నితిన్ హీరోగా క్యాథరీన్ , కృతి శెట్టి హీరోయిన్ లుగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ఆగస్ట్ 25 వ తేదీన ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న లైగర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. మరి ఆగస్ట్ నెలలో విడుదల కావడానికి రెడీ గా ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: