టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే మాస్ హీరో ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో లలో ఒకరు అయిన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  గోపిచంద్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు .

ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో గోపీచంద్  లాయర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపి చంద్ తన తదుపరి మూవీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గోపీచంద్ మరి కొన్ని రోజుల్లో శ్రీ వాస్  దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం , లౌక్యం మూవీ లు తెర కెక్కాయి. ఈ రెండు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ మూవీ లుగా నిలిచాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు మూవీ లు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడవ మూవీ పై సినీ ప్రముఖులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ గోపీచంద్ కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: