టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ తరువాత లక్ వల్ల పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి హిట్లు కొట్టి క్రేజ్ సంపాదించుకున్నాడు. పాపం ఇప్పుడు అతడి కెరీర్ కి హిట్లు కేవలం ఆ మూడు సినిమాలే. ఆ సినిమాల పుణ్యమా అని విజయ్ ఇన్ స్టాలో ఫేమస్ అయ్యి ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. అయితే విజయ్ క్రేజ్ కేవలం ఇంస్టాగ్రామ్ వరకే అని ప్రెసెంట్ అతని తీరు సినిమాలు నిరూపిస్తున్నాయి. పాపం అసలే వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కెరియర్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా మరొక పెద్ద అట్టర్ ఫ్లాప్ నిలిచింది. ఈ సినిమాతో పైకి ఎగురుదాం అనుకున్న విజయ్ కి నిరాశ ఎదురైంది. దాంతో విజయ్ ప్రమోషన్లలో చెప్పిన బడాయి మాటలకి ఇంకా ఓవర్ యాక్షన్ కి అలాగే పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ పై చేసిన కామెంట్స్ కి ఇంకా ఛార్మి రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పుడు ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన లాఫ్ రియాక్షన్లకి జనాలు బాగా బుద్ధి చెప్పారు.వీరు చేసిన తప్పులు ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికలబడింది.


సినిమా ఊహించని షాక్ ఇవ్వడంతో ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా ఖుషి పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి శివానిర్వాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.తాజాగా ఈ సినిమా షెడ్యూల్ ఈ మధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్లో మొదలైంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.మరొక వారంలో సమంత కూడా షూటింగ్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతోంది.అయితే మరోవైపు అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండ కి అడ్వాన్స్ ఇచ్చేశారు. కానీ ఇప్పటిదాకా సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు విజయ్ దేవరకొండ కోసం ఒక మంచి డైరెక్టర్ను వెతికే పనిలో పడ్డారట. ఎవరైతే విజయ్ దేవరకొండకు సెట్ అయ్యే  వాళ్ళతో ఆ సినిమా నిర్మించడానికి దిల్ రాజు రెడీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: