నువ్వు చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నావ్. తెలుగు సినిమాలలో నటించవచ్చు కదా అని సుమన్ భానుచందర్ ను ఆతృతగా అడిగాడట. నాకు తెలుగులో ఓనమాలు కూడా రావు అలాంటిది నేను తెలుగు సినిమాలు ఎలా నటించగలడు అన్నాడట సుమన్. అప్పుడు మూడు నెలల్లోనే తెలుగు బాగా చక్కగా మాట్లాడుతావు. మాకు తెలుగు నేర్పించే స్థాయికి ఎదుగుతావ్ అంటూ కామెంట్ చేశారు భానుచందర్. ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ ను కలసి సుమన్ ను తెలుగులో పరిచయం చేయాలని బాను చందర్ కోరాడట. అతను అడిగాడు లేదో సుమన్ తో సినిమా చేసేందుకు తమ్మారెడ్డి భరద్వాజ ఒప్పుకున్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఇద్దరు కిలాడీలు సినిమా విడుదలైంది. ఆ తర్వాత కోడి రామకృష్ణ తరంగిణి సినిమా విడుదలై దాదాపు 300 రోజులు ఆడింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఒకానొక సమయంలో భానుచందర్ ను తనతో మాట్లాడవద్దని సుమన్ చెప్పాడట. ఏం జరిగిందని అడిగితే నన్ను కేసులో ముద్దాయిగా చేర్చారు.. నాతో క్లోజ్ గా ఉంటే నిన్ను కూడా అందులో చేర్చే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని రోజులు నాతో కలవకు అని సుమన్ చెప్పాడట. ఇక అప్పుడే స్నేహితుడు అంటే సుఖల్లోనే కాదు కష్టాలలో కూడా ఆలోచించాలని నా గురించి అలాగే సుమన్ ఆలోచించాడని భానుచందర్ చెప్పుకొచ్చాడు