అందాల ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చార్మి కౌర్ కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగింది. అలాగే ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది.

కేవలం కమర్షియల్ మూవీ లలో మాత్రమే కాకుండా చార్మి కౌర్ 'జ్యోతిలక్ష్మి' వంటి లేడీ ఓరియంటెడ్ మూవీ లలో కూడా నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించింది. ఇలా ఎన్నో సంవత్సరాలు తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఛార్మి కౌర్ ప్రస్తుతం సినిమాల్లో నటించడం కంటే కూడా సినిమాలను నిర్మించడంలో ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే చార్మి కౌర్ అనేక సినిమాలను నిర్మించింది. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా చార్మి కౌర్ ,  విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది.

మూవీ లో అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఛార్మి కౌర్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేయడం జరిగింది. సోషల్ మీడియా నుండి కొంత కాలం పాటు విరామం తీసుకుంటున్నట్లు ఛార్మి కౌర్ ప్రకటించింది. అలాగే పూరి కనెక్ట్స్ పెద్దగా మరియు చాలా మెరుగ్గా తిరిగి పుంజుకుంటాయని కూడా ఛార్మి కౌర్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: