తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లలో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి అన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా జులాయి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ లో సోను సూద్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించి , కలెక్షన్ ల వర్షాన్ని కురిపించింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో సమంత , నిత్యా మీనన్ , ఆదా శర్మ ,  అల్లు అర్జున్ సరసన హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైట్రిక్ మూవీ గా అలా వైకుంఠపురంలో సినిమా తెరకెక్కింది.

మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాయి. ఇది ఇలా ఉంటే మరో సారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు హీరోగా ఒక మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. ఆ మూవీ పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ హీరోగా మరో మూవీ ని తెరకెక్కించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: