మెగాస్టార్ మేనల్లుడుగా.. స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు గా.. ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య మనవడుగా.. మెగా కాంపౌండ్ హీరోగా ఇలా భారీ బ్యాక్ గ్రౌండ్ లో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గంగోత్రి సినిమాలో హీరోగా అవతారమెత్తాడు. ఇక గంగోత్రి సినిమా నుంచి మొన్నటికి మొన్న వచ్చిన పుష్ప సినిమా వరకు అల్లుఅర్జున్ ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ.


 ఇక తన తర్వాత సినిమాలో కూడా అదే లెవెల్లో ఉండాలనే ప్రస్తుతం ఎంతో ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బన్ని గురించి ఒక విషయం నెట్టింట్లో తెగ వైరల్ గా మారిపోయింది. హీరోలు సినిమాలు వాణిజ్య ప్రకటనల ద్వారా గట్టిగానే సంపాదిస్తారు. తద్వారా లగ్జరీ లైఫ్ లో ఎంత పడితే అంత దుబారా ఖర్చులు పెడతారని  ఎంతో మంది అనుకుంటారు. కానీ బన్నీ మాత్రం ఆ కేటగిరిలో రారట. అల్లు అర్జున్ ప్రతి రూపాయి కూడా ఆలోచించి ఖర్చు పెడతారట.


 అంతే కాదు తన పిల్లలకు కూడా డబ్బు విలువ ఏంటి అని చెప్పి వేస్ట్ చేయకుండా మంచి అవగాహన కల్పిస్తారట. మరీ ముఖ్యంగా ఎవరైనా ఆహారాన్ని వేస్ట్ చేస్తే ఆయనకు చెడ్డ చిరాకు వస్తోందట. ఇక తన పిల్లలకు కూడా అన్నం ఎంతో విలువైనది అన్న విషయాన్ని చెబుతూ ఉంటారట. అంతే కాదు తన పిల్లలకు గానీ భార్య గాని అన్నం వదిలేస్తే ఫుడ్ వేస్త్ చేసే వారిపై అరవడం కూడా చేస్తాడట. ఎంత కష్టపడితే నాలుగు ముద్దలు కడుపులోకి వెళ్తున్నాయో తెలుసుకోండి అంటూ పెద్దగానే క్లాస్ పీకుతాడట. ఈ విషయం తెలిసి ఎంతైనా మా అభిమాన హీరో గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: