తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా భారీ భారీ విజయాలను అందుకున్న దర్శకుడు శ్రీనువైట్ల. ఆయన పరిస్థితి గత కొంతకాలంగా ఏమాత్రం బాగోలేదని చెప్పాలి. అంతకుముందు ఆయన ఏ సినిమా చేసిన కూడా ప్రేక్షకులను భారీ స్థాయి లోనే అది మెప్పించేది. కానీ ఇటీవల ఆయన సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఆయనకు గడ్డుకాలం నడుస్తుంది అని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ ఆయన ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన బ్రూస్ లీ సినిమా నిరాశపరచడంతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.

ఆ విధంగా ఆ తర్వాత ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఏ ఒక్క సినిమా కూడా కనీసం ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ఆయన ప్రాబల్యం కొంత కొంత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఒక నార్మల్ దర్శకుడికి ఉన్న క్రేజ్ కూడా ఈ దర్శకుడికి లేకపోవడంతో పెద్ద హీరోలు అందరూ కూడా ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. మీడియం రేంజ్ హీరోలు కూడా ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆయన ఎవరితో సినిమా చేయాలో అన్న సందిగ్ధతలో ఉన్నారు.

తాజాగా ఆయన గోపీచంద్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవలే ఓ కథను ఆయనకు వినిపించగా అది బాగా ఉండటంతో గోపీచంద్ ఆయన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది మరి ఈ సినిమాతోనైనా శ్రీనువైట్ల మళ్లీ కం బ్యాక్ చేస్తాడా అనేది చూడాలి లేకపోతే మంచు విష్ణుతో కలిసి ఢీ అండ్ ఢీ అనే మరొక సినిమాను కూడా మొదలుపెట్టారు. మరి ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి శ్రీను వైట్ల తప్పకుండా పూర్వ వైభవాన్ని అందుకోవాలి అంటే గోపీచంద్ తో చేసే సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాల్సిందే అని ఆయన అభిమానులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: