తాజాగా బ్రహ్మాస్త్రం అనే బాలీవుడ్ సినిమా భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరోగా నటించగా , ఆలియా బాట్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించగా , అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయ్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ మూవీ ని హిందీ తో పాటు తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ ని తెలుగు లో దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించాడు. ఇలా ఈ మూవీ ని దర్శకతీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెలుగు లో సమర్పించడం వల్ల ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ప్రస్తుతం ఈ సినిమా తెలుగు లో కూడా మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.

ఇప్పటికే తెలుగు లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బ్రహ్మాస్త్రం సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బ్రహ్మాస్త్రం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి డిస్నీ ప్లేట్స్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకున్నట్లు , కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: