టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నిన్ను కోరి , మజిలీ , టక్ జగదీష్ మూవీ లకు దర్శకత్వం వహించిన శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తుండగా , సమంతమూవీ లో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇది వరకే విజయ్ దేవరకొండ మరియు సమంత మహానటి సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా.

ఇది వరకే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అక్టోబర్ రెండవ వారం నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా లిగర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.  మరి లైగర్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: