ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' లాంటి కళాఖండం తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్తా గ్లోబల్ స్టార్ అయ్యాడు. దేశ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఆ తరువాత అన్ని వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు ప్రభాస్. ఈ నేపథ్యంలో బాహుబలి తరువాత వచ్చిన 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. ఇంకా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ కె' చిత్రాలను ఒకేసారి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాల్లో 'ప్రాజెక్ట్-కె'పై భారీ బజ్ ఉంది. 'మహానటి' తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇదే కావడంతో అభిమానుల అంచనాలకు అవధులు లేకుండా పోయాయి. 'ప్రాజెక్ట్-కె'లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తోంది. భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అందుకోసం హాలీవుడ్ నుంచి పలువురు యాక్షన్ దర్శకులు ఈ సినిమాకి పని చేయబోతున్నారని తెలుస్తోంది.


మూడో ప్రపంచ యుద్ధం కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఐదు యాక్షన్ సీక్వెన్స్‌లున్నాయి. ఈ సన్నివేశాలకు హాలీవుడ్‌కి చెందిన యాక్షన్‌ ఎక్స్‌పర్ట్‌లు కొరియోగ్రఫీ చేస్తారని సమాచారం. అయితే ఒక్క స్టంట్ మాస్టర్ మాత్రం అన్ని యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయడం అసాధ్యమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఈ సీన్స్ కోసం నలుగురైదుగురు యాక్షన్ డైరెక్టర్స్ పని చేస్తారని సమాచారం.ఈ సినిమాకు మహాభారతానికి సంబంధించిన అనుబంధాలు కూడా ఉంటాయని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అమితాబ్ పాత్ర అశ్వత్థామ పాత్ర నుండి ప్రేరణ పొందింది. బిగ్ బిపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించినట్లు సమాచారం. 'ప్రాజెక్ట్-కె' షూటింగ్ 2023 తొలినాళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది.అదే ఏడాది చివర్లో లేదా 2024 మొదట్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.ఏకంగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: