ఇక టాలీవుడ్ సీనియర్ హ్యాండ్సమ్ హీరోల్లో కింగ్ నాగార్జున కూడా ఒకరు.. ఈయన సీనియర్ హీరో అయినప్పటికీ తన కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే బంగార్రాజు సినిమాను తన పెద్ద కొడుకు నాగ చైతన్యతో కలిసి చేసి సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇక దసరా పండక్కి సోలోగా రాబోతున్నాడు.ది ఘోస్ట్ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కంటే ముందే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలక నటించడం జరిగింది.నాగార్జున పాత్రకి బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు. నాగ్ యాక్షన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇక బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నాగిని ఫేమ్ మౌని రాయ్ విలన్ గా కనిపించింది.


ఈమె తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొని నాగార్జున గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ఈయన ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించారని.. అప్పుడే ఆమెకు కూడా ఆయనతో పరిచయం ఏర్పడిందని.. ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.ఇంకా నాగార్జున సెట్ లో ఉంటే అమ్మాయిలంతా ఆయన చుట్టూనే ఉండేవారట. సెట్ లో రణబీర్ కపూర్ ఉన్న కూడా నాగార్జున చుట్టూనే అమ్మాయిలు కనిపించే వారని ఆయనతో మాట్లాడేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వారని తెలిపింది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా సెట్ లో పోటీ పడి మరీ నాగార్జునతో మాట్లాడేవారట.. మరి కింగ్ అంటే ఎవర్ గ్రీన్ మన్మధుడుగా ఆ మాత్రం ఉండాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: