మలయాళం నుండి వచ్చి తమిళ తెలుగు భాషలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ లలో సమంత రుతుప్రభు ఒకరు. ఈమె హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్న సమయం లోనే సహా నటుడు అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంత కాలం వీరు వైవాహిక జీవితాన్ని అనుభవించిన అనంతరం వీరి మధ్యన ఏర్పడిన వివిధ సమస్యలతో ఎవరి దారి వారు చూసుకున్నారు. దీనితో అటు ఇరు కుటుంబాలు మరియు ఫ్యాన్స్ కూడా బాధలో మునిగిపోయారు. ఇద్దరూ ప్రస్తుతం తమ కెరీర్ లో బిజీ గా ఉన్నారు. కాగా సమంత కేవలం దక్షిణాది కే పరిమితం కాకుండా ఉత్తరాది లోనూ కాలు మోపి దూసుకుపోతోంది.

"ఫ్యామిలీ మ్యాన్ 2" లో నటించి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత బాలీవుడ్ లో మరో సినిమాలు సైన్ చేశారట. అయితే దీనికి ముందే వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేస్తోంది. ఇప్పుడు మాత్రం యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తో జత కట్టనుంది. ఈ సినిమా ఒక హారర్ కామెడీ జోనర్ లో సాగుతుందట. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత రాణి పాత్రలో నటిస్తుంది అని తెలుస్తోంది. కాగా నిర్మాతల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం ఈ సినిమా షూటింగ్ మొదలు పెడతారట.

మరి సమంతకు బాలీవుడ్ లో ప్రవేశం అయితే రెండు సినిమాల రూపంలో దొరికింది.  కానీ అవి హిట్ అయ్యి ముందు ముందు మరిన్ని సినిమాలు చేసే అక్కడే స్థిరపడుతుందా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. కాగా సమంత నటించిన యశోద మరియు శాకుంతలం మూవీలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి.








మరింత సమాచారం తెలుసుకోండి: