మరో సారి హిట్ కొట్టిన తమిళ స్టార్ హీరో, ఈ నెలలో కోలీవుడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ముగ్గురు పేరున్న  పెద్దా దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్, సెల్వ రాఘవన్ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

మణిరత్నం, సెల్వ రాఘవన్ ల కంటే ముందే గౌతమ్ మీనన్ తన సినిమాను థియేటర్లోకి దించేశారు. ఆ సినిమానే 'వెందు తనిందద కాడు'. దర్శకుడిగా గౌతమ్ మీనన్ టాలెంట్ గురించి  మన అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన  అవసరం లేదు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం తన స్థాయికి తగ్గ సినిమాలు  గౌతమ్ చేయ లేక పోతున్నారు ఈ దర్శకుడు.

మరోపక్క ఫైనాన్షియర్లతో గొడవలు సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ అడ్డంకులన్నీ దాటుకొని శింబు హీరోగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన 'వెందు తనిందద కాడు' సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శింబు కాటికాపరి స్థాయి నుంచి గ్యాంగ్ స్టర్ గా మారే పాత్రను పోషించారు. ఇప్పుడు ఈ సినిమాకి కోలీవుడ్ లో హిట్ టాక్ వస్తోంది.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇస్తున్నారు. చాలా కాలం తరువాత గౌతమ్ మీనన్ తన రేంజ్ సినిమా తీశారని.. శింబు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారని.. రెహ్మాన్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే సినిమా కచ్చితంగా హిట్ అయ్యేలానే ఉంది. ఈ సినిమాను తెలుగులో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' పేరుతో విడుదల చేయనున్నారు.

నిజానికి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాల్సింది కానీ కొన్ని కారణాల వలన శనివారం నాటికి సినిమాను వాయిదా వేశారు. మరి తెలుగులో ఈ సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలని వుంది అని గౌతమ్ పేర్కొన్నారు, ఈ చిత్రం  మిమ్మల్ని భాగా ఆకట్టుకునే విధంగా చిత్రీకరణ చేశామని గౌతమ్ చెప్పారు..

మరింత సమాచారం తెలుసుకోండి: