ఇక బుల్లితెరపై ప్రారంభమైన బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన హరితేజ అక్కడ కూడా తనలో దాగివున్న టాలెంట్ నిరూపించుకునీ ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ హరికథ స్క్రిప్ట్ లో నటించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వరుస అవకాశాలతో బిజీ అయింది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా ఎప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా ఎంతో చలాకీగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఇకపోతే దసరా పండుగ సందర్భం గా నవరాత్రి ధమాకా అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ టీవి నిర్వాహకులు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ కార్యక్రమంలో హరితేజ కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న హరితేజ మాయా బజార్ సినిమాలో సావిత్రి చేసిన పాత్రలో సందడి చేసింది. సావిత్రి జీవితంలో కొన్ని ఘటనలు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇలా ఏకంగా సావిత్రిని హరితేజ మైమరిపించింది అంటూ ప్రోమోలో ఈ పర్ఫామెన్స్ చూసిన తర్వాత అందరూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ పర్ఫామెన్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు.