తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే మాస్ ఇమేజ్ కలిగి ఉన్న హీరో లలో ఒకరు అయిన గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపీచంద్ ఇప్పటికే ఈ సంవత్సరం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో గోపీచంద్ లాయర్ పాత్రలో నటించాడు. రాశి ఖన్నామూవీ లో గోపీచంద్ సరసన కథానాయకగా నటించింది.

మూవీ లో సత్య రాజ్ ఒక కీలక పాత్రలో నటించగా ,  రావు రమేష్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా గోపీచంద్ సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడు గా కెరియర్ నీ మొదలు పెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,  ముకుంద ,  బ్రహ్మోత్సవం , నరప్పా వంటి మూవీ లకు దర్శకత్వం వహించే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి దర్శకుడు గా గుర్తింపు ను సంపాదించుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో గోపీచంద్ ఒక మూవీ లో నటించ బోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే గోపీచంద్ కు శ్రీకాంత్ అడ్డాల ఒక కథను వినిపించగా ఆ కథ బాగా నచ్చిన గోపీచంద్ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: