అతిలోక సుందరి శ్రీదేవి గురించి భారత సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రీతిలో శ్రీదేవి ప్రస్థానాన్ని కొనసాగించింది. ఇప్పుడు మనం అందరం పాన్ ఇండియా సినిమాలు అని చెప్పుకుంటున్నాం. ఇక అన్ని భాషలలో సూపర్ హిట్ సాధిస్తే వారిని పాన్ ఇండియా నటులు అంటూ పిలుస్తూ ఉన్నాం.. కానీ ఒకప్పుడు ఇలా పాన్ ఇండియా పదం పుట్టకముందే శ్రీదేవి అన్ని భాషలలో కూడా సినిమాలు చేస్తూ వరుసగా సూపర్ హిట్ లు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది.


 అంటే అప్పట్లోనే పాన్ ఇండియా అనే పదానికి అసలు సిసలైన అర్థం చెప్పింది శ్రీదేవి. దాదాపు మూడు దశాబ్దాల పాటు దర్శకులు మెచ్చిన హీరోయిన్గా.. ప్రేక్షకులకు అతిలోకసుందరిగా.. స్టార్ హీరోల సినిమాకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగింది శ్రీదేవి అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు శ్రీదేవి అందరూ స్టార్ హీరోల సరసన నటించిన విషయం చాలామందికి తెలుసు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా వెలుగొందిన కమెడియన్ రాజబాబు సరసన కూడా శ్రీదేవి హీరోయిన్గా నటించింది అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.



 అయితే ఇలా కమెడియన్ రాజబాబు సరసన శ్రీదేవి హీరోయిన్గా నటించింది హీరోయిన్ గా కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రం కాదు అని చెప్పాలి. అప్పుడప్పుడే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగులు వేస్తున్న సమయంలో 1975లో శ్రీదేవి రాజబాబు సరసన నటించింది. మంజుల హీరో హీరోయిన్గా నటించిన దేవుడు లాంటి మనుషులు సినిమాలో శ్రీదేవి రాజబాబు సరసన నటించింది. ఈ సినిమాలో ఒక పాటలో రాజబాబు తో కలిసి డాన్సులు కూడా చేసింది. కానీ ఆ తర్వాత కాలంలో శ్రీదేవిహీరోయిన్ కు  సాధ్యం కానీ రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీదేవి వారసత్వాన్ని జాన్వి కపూర్ కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: