అల్లు అర్జున్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇది వరకే 3 మూవీ లు తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే . వీరిద్దరి కాంబినేషన్ లో మొదటగా జులాయి మూవీ తెరకెక్కిందిబి. ఈ మూవీ అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ,  అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది . ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో అలా వైకుంఠపురంలో మూవీ తెరకెక్కింది.

మూవీ కూడా సూపర్ హిట్ ని సాధించింది. ఇలా ఇప్పటికే మూడు మూవీ లు వీరిద్దరి కాంబినేషన్ లో మూడు మూవీ లు తెరకెక్కాయి. అలాగే ఆ మూడు మూవీ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగవ మూవీ తెరకెక్కబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే నాలుగో మూవీ కి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నట్లు ,  అవి దాదాపు ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ తర్వాత మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ,  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: