డైరెక్టర్ గౌతం మీనన్ తెరకెక్కించిన లవ్ రొమాంటిక్ చిత్రం ఏమాయ చేసావే సినిమా ద్వారా మొదట ఇండస్ట్రీకి పరిచయమైన సమంత ఆ తర్వాత తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఆ సినిమాలో జత కట్టిన నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని కొన్ని కారణాల చేత గత ఏడాది విడిపోవడం జరిగింది. ఇక మహానటి చిత్రం నుంచి సొంతగా తన వాయిస్తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సమంత.

అయితే ఈ విషయంపై వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియడం లేదు ఇదంతా ఇలా ఉండగా తాజాగా యశోద మేకర్స్ మాత్రం సమంతాకు చిన్మయి చేత డబ్బింగ్ చెప్పించాలని చూస్తున్నారట అయితే సమంత మాత్రం అందుకు ఒప్పుకోకుండా తానే స్వయంగా చెబుతానని తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇక ఆ కారణంగానే యశోద సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సమంత పలు అనారోగ్య సమస్యల వల్ల కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.


అలా ఇప్పుడు తాజాగా హైదరాబాద్ కి తిరిగి వచ్చిన సమంత అర్జెంటుగా యశోద డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తానని చిత్ర యూనిట్కు చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ చిత్ర బృందం మాత్రం చిన్మయితో చెప్పించాలని పట్టుబడుతూ ఉంటే తను మాత్రం ఆ పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని సమంత చాలా పట్టు పడుతోందట మేకర్స్ మాట పక్కన పెట్టి సమంత కెరీర్ తో చాలా రిస్క్ చేస్తుందని అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి సమంత తీసుకునే నిర్ణయం తన కెరీర్ కు ప్లస్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: