దసరా పండుగ సందర్భంగా ప్రతీ సంవత్సరం కూడా కేంద్ర మాజీ మంత్రి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ `అలయ్ బలయ్` కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు.ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అలయ్ బలయ్` కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింమారావు సభా వేదికగా చినంజీవిపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీశాయి.సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారు దత్తాత్రేయ ఫ్యామిలీ చిరుతో ప్రత్యేకంగా ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటో సెషన్ ని ఆపేసి వేదికపైకి రావాలని లేదంటే తాను వెళ్లిపోతానని గరికపాటి నరసింహారావు వివదాస్పందంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


తాజాగా గురువారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన చిరంజీవి..గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ పై స్పందించారు.గురువారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన మెగాస్టార్ ఓ పాత్రికేయుడు గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ పై స్పందించాలని కోరగా ఈ వివాదాన్ని ఒక్క మాటలో తేల్చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు చిరంజీవి. ఆయన పెద్దాయన.. ఆయన చేసిన కామెంట్స్ పై చర్చించుకోవాల్సిన అవసరం లేదు` అని ఒక్క మాటలో తేల్చేయడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి `పెద్దాయన` అంటూ ఒక్క మాటతో తేల్చేయడంతో అంతటితో ఆ వివాదం ముగిసినట్టయింది.ఇక దర్శకుడు బాబీతో చేస్తున్న సినిమాలో తన పాత్ర పూర్తి స్థాయి మాసీవ్ గా వుంటుందని సంభాషణలు తూర్పుగోదావరి యాసలో వుంటాయన్నారు. దీపావళికి బాబితో చేస్తున్న సినిమా మోషన్ పోస్టర్ టైటిల్ ని విడుదల చేస్తున్నామన్నారు.

`ఆచార్య` ఫ్లాప్ పై కూడా ఈ సందర్భంగా స్పందించారు. ఏ సినిమా ఫ్లాప్ అయినా తాను బాధ్యత తీసుకుంటానని `ఆచార్య` ఫెయిలైనందుకు తాను బాధపడలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా 80 శాతం పారితోషికాన్ని తాను చరణ్ తిరిగి వెనక్కు ఇచ్చేశామని అయితే ఈ విషయం పెద్దగా బయటికి రాలేదన్నారు. ఇక `ఆర్ ఆర్ ఆర్` విజయం కన్నా చరణ్ `గాడ్ ఫాదర్` విజయంనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: