సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో విహరించడానికి ఎంత ప్రాధాన్యత నిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా మిగతా స్టార్ హీరోలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఫ్యామిలీకి ఆయన ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు.అయితే ఈ సారి మాత్రం ఫ్యామిలీ లేకుండానే సూపర్ స్టార్ మహేష్ విదేశాలకు వెళుతున్నట్టుగా వార్తలు అనేవి వినిపిస్తున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ తో తన 28వ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన మహేష్ బాబు మెరుపు వేగంతో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసి తరువాతి షెడ్యూల్ కోసం రెడీ అయ్యాడు. ఇంకా అదే సమయంలో మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి గారు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ రెండో షెడ్యూల్ కి బ్రేక్ పడింది. తల్లి మరణంతో మహేష్ షూటింగ్ కు దాదాపు 12 రోజులు దూరమయ్యాడు. ఈ సమయంలో తల్లి అస్తికల్ని కాశీలో కలపడంతో పాటు కాశీ వెళ్లి తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చారు. 11వ రోజున కార్యక్రమం ఇటీవలే పూర్తయింది.


ఈ నేపథ్యంలో మహేష్ బాబు తరువాతి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడని త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ రెండో షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నాడంటూ వార్తలు మొదలయ్యాయి.అయితే మహేష్ బాబు మాత్రం .. సెట్ లోకి వెళ్లడం లేదని హెల్త్ చెకప్ కోసం ఒంటరిగా విదేశాలకు వెళుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి తిరిగి వచ్చాకే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా తరువాత షెడ్యూల్ కోసం డేట్స్ కేటాయించబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. అయితే నవంబర్ లోనే ఆ షెడ్యూల్ వుండే అవకాశం వుంది.ఇదిలా వుంటే మహేష్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా లుక్ టెర్రిఫిక్ గా వుండి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారి నెట్టింట ట్రెండవుతోంది. మహేష్ లుక్ ని చూసిన వారంతా వయసు పెరుగుతున్నా రోజు రోజుకీ మరింత యంగ్ అవుతున్నారంటూ కామెంట్ లు చేస్తున్నారు.సర్కారు వారి పాటతో మంచి హిట్ అందుకున్న మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: