అక్కినేని నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు టైటిల్ నిర్ణయించడం అక్కినేని అభిమానులలో ఎంతో సంతోషాలను నెలకొనేలా చేస్తుంది. చాలా రకాల టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు ఈ సినిమాకు 302 అనే టైటిల్ ను పెట్టారు. ఆ విధంగా అక్కినేని నాగచైతన్య కెరియర్ లోనే ఎంతో వెరైటీ సినిమాగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పవచ్చు. తమిళనాడు లో వెరైటీ దర్శకుడుగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచాడు వెంకట్ ప్రభు.

ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన మానాడు చిత్రం ఎంతటి పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శింబు హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అవుతూ ఉండడం ఈ దర్శకుడు యొక్క ప్రతిభకు నిదర్శనం అని చెప్పాలి. ఇంతటి గొప్ప రికార్డును కలిగి ఉన్న ఈ దర్శకుడు ఈ చిత్రాన్ని ఏ విధంగా చేసి నాగచైతన్యకు విజయాన్ని తెచ్చి పెడతాడో చూడాలి. 

 ఇప్పటికే నాగచైతన్య థాంక్యూ సినిమాతో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అక్కినేని అభిమానులను సంతోషపెట్టాలి అంటే తప్పకుండా ఓ భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వెరైటీ కథ గా రుపొందుతున్న సినిమా కాబట్టి ఇది వారిని ఎంతగానో సంతోష పెడుతుంది అని చెబుతున్నారు. ఇక కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండడం ఈ సినిమా పట్ల పాజిటివ్ వైబ్స్ ఉండడానికి కారణం అవుతుంది. వీరిద్దరూ కలిసి బంగార్రాజు సినిమాలో నటించగా అది భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా అరవింద స్వామి నటిస్తున్నట్లుగా ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.  ప్రియమణి, సంపత్ రాజ్ లాంటి స్టార్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: