టాలీవుడ్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరోలుగా పేరు తెచ్చుకుని రాణిస్తున్నారు. అటువంటి యంగ్ హీరోలలో ఒకరు విశ్వక్ సేన్.. ఇతను తన సినిమాల్లో కథతో సంబంధం లేకుండా.. 100 శాతం ఇవ్వదని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే ఈ రోజు ప్రేక్షకుల ఇంతటి పోటీ వాతావరణంలోనూ ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా మాత్రమే కాకుండా రైటర్ మరియు దర్శకుడు కూడా కావడం విశేషం. మొదట తన కెరీర్ ను వెళ్ళిపోమాకే అనే సినిమాతో స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు గాను తనకు సైమా లో అవార్డ్స్ కు నామినేట్ అయ్యాడు.

ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి సినిమాలతో తానేమిటో నిరూపించుకుని టాలీవుడ్ లో టాక్ అఫ్ ది హీరోగా మారిపోయాడు. సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ దర్శకులకు మంచి ఎంపికగా మారాడు. కాగా ఇప్పుడు తాను నటిస్తున్న చిత్రం "ఓరి దేవుడా"... ఈ చిత్రానికి అశ్విన్ మరిముత్తు అనే తమిళ డైరెక్టర్ ఎంతో ఫాషన్ తో తెరకెక్కించాడు. ఇది తమిళ్ లో ఇప్పటికే వచ్చిన "ఓమై కడవులే" చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. విశ్వక్ సేన్ సరసన మిథిలా పల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇందులో ప్రముఖ పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించడంతో ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న విశ్వక్ సేన్ తన మనసులో మాటను బయట పెట్టాడు. నాదగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అన్నా నువ్వు మాస్ హీరోలా ఉన్నావు అంటూ అన్నీ మాస్ కథలనే చెబుతున్నారు. కానీ నాకు లవ్ స్టోరీస్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. అంతే కాకుండా డైరెక్టర్ లను ఉద్దేశించి నాకోసం లవ్ స్టోరీ ని రెడీ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం ఈ న్యూస్ చూసి ఎవరైనా లవ్ స్టోరీ ని తనకోసం రాస్తారేమో ?




మరింత సమాచారం తెలుసుకోండి: