కొంతమంది హీరోలకు వరుసగా ప్లాపులు వచ్చినా కూడా సినిమా అవకాశాల సంఖ్య వారికి ఏమాత్రం తగ్గదు. ఆ విధంగా నితిన్ గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోతున్నా కూడా ఆయనకు సినిమాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నితిన్ ఆ తర్వాత ఏకంగా నలుగురు దర్శకులతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇందులో కొంతమంది అగ్ర దర్శకులు కూడా ఉండడం ఆయనకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పడానికి నిదర్శనం అవుతుంది. 

భీష్మ సినిమా తర్వాత ప్రేక్షకులను అలరించే ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు నితిన్. కారణమేదైనా కూడా ఆయన స్టోరీ ఎంపికల విషయంలో చాలా తొందరపడ్డాడు అని చెప్పాలి. తాజాగా విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా మాస్ ప్రేక్షకులను టార్గెట్ గా చేస్తూ వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ సినిమాలో మాస్ అంశాలు తప్ప కథ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశపరిచింది అని చెప్పుకుంటున్నారు. దీంతో నితిన్ అభిమానులు నితిన్ కెరియర్ ఎలా ముందుకు సాగుతుందని కొంత కలవరపడడం మొదలుపెట్టారు.

గతంలో కూడా నితిన్ ఇలాంటి పరిస్థితి ని ఎదుర్కొన్నాడు. అలా ఇప్పుడు మళ్లీ విజయ బాటలో నడిచాడు అని చెప్పాలి. ఇష్క్ సినిమాతో తన రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన నితిన్ ఆ తర్వాత ప్రేక్షకులను అలరించే సినిమాలు చేస్తూ వచ్చి ఇప్పుడు హీరోగా స్థిర పడగలిగాడు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వచ్చిన నితిన్ గత రెండు మూడు సినిమాలుగా పరుస ప్లాపులను అందుకోవడం నిజంగా చాలా మందిని కలవరపరిచింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో తప్పకుండా మంచి విజయాలను అందుకోవడం ఖాయం అని ఆయన అంటున్నాడు. వక్కంతం వంశీ సినిమా తర్వాత మరో నలుగురు దర్శకుల తో ఆయన సినిమాలు చేస్తున్న నేపథ్యంలో తొందరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం ఖాయం అని చిత్ర బృందాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: